మహారాష్ట్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
- కొండచరియలు విరిగిపడి ఐదు ఇళ్లు ధ్వంసం
- శిథిలాల కింద మరికొందరు
- 16 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు
- మరో ఘటనలో ముగ్గురి మృత్యువాత
శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 5 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరో 8 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా, ముంబైలోని విక్రోలీ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.