నన్ను కేసీఆర్ మోసం చేశాడని ప్రజలు నమ్ముతున్నారు: ఈటల రాజేందర్
- హుజూరాబాద్ ఉపఎన్నిక అహంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక
- తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది
- రాష్ట్ర ప్రజలందరూ హుజూరాబాద్ వైపు చూస్తున్నారు
హుజూరాబాద్ లో కోట్లాది రూపాయలను టీఆర్ఎస్ ఖర్చు చేస్తోందని.. కుల సంఘం భవనాలను కట్టిస్తామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఈటల మండిపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మబోరని... ఈటల రాజేందర్ ను కేసీఆర్ మోసం చేశాడని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ఉపఎన్నిక వైపు చూస్తున్నారని అన్నారు. ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందామని హుజూరాబాద్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణలో ఎస్సీల జనాభా 17 శాతం వరకు ఉందని... కానీ మంత్రి వర్గంలో వారి ప్రాతినిధ్యం చాలా దారుణంగా ఉందని ఈటల విమర్శించారు. కేవలం 0.5 శాతం మాత్రమే ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు.