ఖమ్మంలో సెకండ్ డోస్ కోసం బారులు తీరిన జనం
- ఒకేసారి వెయ్యి మందికి వేస్తామన్న అధికారులు
- టీకా కేంద్రంలో వసతులు కరవు
- గంటల తరబడి లైన్ లో నిల్చున్న జనం
దీంతో ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకు భారీగా తరలివచ్చిన జనంతో కొంత గందరగోళం ఏర్పడింది. సరైన వసతుల్లేక టీకా కోసం వారు గంటల తరబడి లైన్ లో నిలబడ్డారు. అధికారులు కనీసం కరోనా నిబంధనలు పాటించేలా కూడా ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకా కేంద్రం వద్ద సరైన వసతులేవీ లేవని అసహనం వ్యక్తం చేశారు.