చివరిదశకు చేరుకున్న 'మేజర్'
- బయోపిక్ గా 'మేజర్'
- నిర్మాణ భాగస్వామిగా మహేశ్
- సయీ మంజ్రేకర్ పరిచయం
- పరిస్థితులు అనుకూలించాక విడుదల
ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రేవతి కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాతలలో మహేశ్ బాబు ఒకరుగా ఉండటం విశేషం. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన కరోనా పరంగా అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే బలమైన నమ్మకంతో అడివి శేష్ ఉన్నాడు.