PCB: వాహన కాలుష్య పరీక్షల ఫలితాలు ఇక ఆన్‌లైన్‌లోకి.. పరీక్ష ఆలస్యమైతే భారీ జరిమానా

Telangana PCB tighten norms
  • వాహన కాలుష్య నిబంధనలు మరింత కఠినతరం
  • ప్రత్యేక దృష్టిసారించిన ‘ఎయిర్ క్వాలిటీ కంట్రోల్ కమిటీ’
  • కాలుష్య నియంత్రణ పరీక్ష ఒక్క రోజు ఆలస్యమైనా భారీ జరిమానా
తెలంగాణలో వాహన కాలుష్య నియంత్రణ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. ఇకపై వాహన కాలుష్య పరీక్షలు చేసిన వెంటనే ఆ వివరాలు, ఫలితం ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోతాయి. రవాణాశాఖ, పోలీస్ శాఖకూ చేరుతాయి. ఆరు నెలల గడువులోపు మళ్లీ కాలుష్య పరీక్ష చేయించకపోతే భారీ జరిమానా చెల్లించుకోకతప్పదు. ఆగస్టు నుంచి అంటే వచ్చే నెల నుంచే ఈ విధానం అమల్లోకి రాబోతోంది.

రాష్ట్రంలోని వాయుకాలుష్యంలో 50 శాతానికిపైగా వాహనాల నుంచే వస్తుండడంతో ఈ విషయంపై ‘ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కమిటీలో పీసీబీ, రవాణా, పోలీసులు, పురపాలక తదితర శాఖలు ఉన్నాయి. తొలుత ఈ విధానాన్ని హైదరాబాద్‌లో అమలు చేస్తారు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల వాహనాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచే రోజుకు 1,500 టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నట్టు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి.
PCB
Vehicle
Pollution
Telangana

More Telugu News