Ramesh Varma: 'రాక్షసుడు' సీక్వెల్ కి రంగం సిద్ధం .. పోస్టర్ రిలీజ్!

  • బెల్లంకొండ నుంచి వచ్చిన 'రాక్షసుడు'
  • సైకో కిల్లర్ చుట్టూ తిరిగే కథ 
  • సీక్వెల్ గా 'రాక్షసుడు 2'
  • రంగంలోకి స్టార్ హీరో  
Rakshasudu 2 title poster released

తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో 'రాక్షసుడు' ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేక్షకులను భయపెట్టేసింది. టీనేజ్ అమ్మాయిల వరుస హత్యల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'రాక్షసుడు 2' చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తాజాగా అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.'రాక్షసుడు 2' సినిమాకి 'హోల్డ్ యువర్ బ్రీత్' అనే ట్యాగ్ లైన్ ఉంచారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. సైకో కిల్లర్ ఒక చేత్తో గొడ్డలి పట్టుకుని, మరో చేత్తో ఒక శవాన్ని భుజాన వేసుకుని వెళుతున్న దృశ్యం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో, ఈ సారి హీరో మారనున్నాడు. హీరో ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారట. మొదటి భాగానికి మించి రెండవ భాగం భయానకంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని చెబుతున్నారు. గిబ్రాన్ సంగీతాన్ని  అందిస్తున్న ఈ సినిమాకి, రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందించనున్నారు.  

  • Loading...

More Telugu News