సాగర్ లో విద్యుదుత్పత్తిని ఆపేసిన తెలంగాణ
- 11 రోజులు నిరాటంకంగా ఉత్పత్తి
- 3 కోట్ల యూనిట్ల ఉత్పత్తి
- కేంద్రానికి తెలుగు రాష్ట్రాల పోటాపోటీ ఫిర్యాదులు
ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉన్నా కూడా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని లేఖలు రాసింది. అయితే, తెలంగాణ అవసరాల కోసం తమకున్న హక్కులు, నిబంధనల మేరకే జల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామంటూ తెలంగాణ సర్కార్ తేల్చి చెప్పింది. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుపైనా రెండు రాష్ట్రాలూ పోటాపోటీగా బోర్డుకు లేఖలు రాశాయి. ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తున్నాయి.