ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు.. మెమో దాఖలు చేసే వరకు శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు వద్దన్న తెలంగాణ హైకోర్టు
- గనుల సరిహద్దు వివాదం తేలే వరకు విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టుకు శ్రీలక్ష్మి
- ఊరట కల్పించిన హైకోర్టు
- జగన్ అక్రమాస్తుల కేసు విచారణ 16వ తేదీకి వాయిదా
ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయిందని రాతపూర్వకంగా తెలియజేస్తూ, సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించారు. అప్పటి వరకు శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు, జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.