జమ్మూకశ్మీర్లో ఎదురుకాల్పులు.. బాపట్ల జవాను జశ్వంత్రెడ్డి వీరమరణం
- రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్
- నేటి రాత్రికి బాపట్లకు జశ్వంత్రెడ్డి మృతదేహం
- కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
నేటి రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది. కాగా, జశ్వంత్రెడ్డి 2016లో మద్రాసు రెజిమెంట్లో సైన్యంలో చేరాడు. తొలుత నీలగిరిలో పనిచేసిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. మరో నెల రోజుల్లో కుమారుడికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే అతడు అమరుడైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.