హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ పై రెండు కేసుల నమోదు
- భూవివాదంలో జోక్యం చేసుకున్న మాజిద్
- పోలీసులను కూడా దుర్భాషలాడిన వైనం
- విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్సై రవిరాజ్ ఫిర్యాదు
అసభ్యకర రీతిలో పోలీసులతో వాగ్వాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో మాజిద్ పై బంజారాహిల్స్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. భూవివాదంలో నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిని బెదిరించినందుకు ఒక కేసు, పోలీసులను దుర్భాషలాడినందుకు మరో కేసు పెట్టారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్సై రవిరాజ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.