Chandrababu: కంభంపాటి, దత్తాత్రేయలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

  • మిజోరాం గవర్నర్ గా హరిబాబు నియామకం 
  • హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ
  • పదవీకాలం సాఫీగా సాగిపోవాలన్న చంద్రబాబు
  • కంభంపాటి కచ్చితంగా రాణిస్తారని వ్యాఖ్యలు
Chandrababu congratulates Kambhampati and Dattatreya

మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమితులు కాగా, బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు వారిరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'హర్యానా గవర్నర్ గా నియమితులైనందుకు కంగ్రాచ్యులేషన్స్ దత్తాత్రేయ గారూ' అంటూ ట్వీట్ చేశారు. పదవీకాలం సాఫీగా సాగిపోవాలని, ఆ భగవంతుడి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ఇక, మిజోరాం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ స్పందించారు. గవర్నర్ గా కంభంపాటి కచ్చితంగా రాణిస్తారని, సుహృద్భావ వైఖరితో, అంకితభావంతో, నిబద్ధతతో వ్యవహరిస్తారని చెప్పగలనని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News