కేసీఆర్ తీరు తెలంగాణకు అన్యాయం చేసేలా ఉంది!: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఉమ్మడి ఏపీ ఉన్నప్పటి కంటే జల దోపిడీ ఎక్కువైంది
- ఏపీ దోపిడీనీ కేసీఆర్ అడ్డుకోవడం లేదు
- కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలేనన్న ఉత్తమ్
ఇక ఇన్నాళ్లూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఉత్తమ్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిలో లేకపోయినప్పటికీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలేనని అన్నారు. పోలీసుల వేధింపులను సైతం ఎదుర్కొని కార్యకర్తలు నిలబడ్డారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని... మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని అన్నారు.