Telangana: ఏపీ అభ్యంతరాలు బేఖాతరు... విద్యుదుత్పత్తిని మరింత పెంచిన తెలంగాణ

  • ఏపీ, తెలంగాణ మధ్య ప్రాజెక్టు విభేదాలు
  • తెలంగాణ విద్యుదుత్పత్తిపై ఏపీ అసంతృప్తి
  • తాజాగా పులిచింతల వద్ద 50 మెగావాట్ల ఉత్పాదన
  • మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి
Telangana hikes electricity generation

ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి అంశంలోనూ ఏపీ, తెలంగాణ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఏపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుదుత్పాదన మరింత పెంచింది.

కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన తెలంగాణ జెన్ కో... ఇవాళ మధ్యాహ్నం 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఏపీ అధికారులు ఆరోపించారు. పులిచింతలలోని 3 యూనిట్ల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News