కరోనా టీకా ఒక్క డోసు తీసుకున్నా మరణాల నుంచి 92% రక్షణ: కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడి

Corona Death Risk Decreased by 92 percent If administered even a single dose of vaccine
  • రెండు డోసులతో 98% భద్రత
  • పంజాబ్ పోలీసులపై అధ్యయనం
  • వివరాలను వెల్లడించిన నీతిఆయోగ్ సభ్యుడు
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే మహమ్మారి మరణాల ముప్పును 98 శాతం తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క డోసు తీసుకున్నా ఆ ముప్పు 92 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. పంజాబ్ లో వ్యాక్సిన్ తీసుకున్న పోలీసులపై చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని తెలిపింది. ఆ అధ్యయన సమాచారాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు.

35,856 మంది పోలీసులు ఒక్కడోసు వ్యాక్సిన్ తీసుకుంటే.. అందులో కరోనా సోకి 9 మంది చనిపోయారని, వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిలో కరోనాతో చనిపోయింది 0.25 శాతమేనని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న 42,720 మందిలో కేవలం ఇద్దరే (0.05%) చనిపోయారన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోని 4,868 మంది సిబ్బందిలో 15 మంది మృత్యువాత పడ్డారన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా తీవ్రత తగ్గడమే కాకుండా మరణాల ముప్పునూ గణనీయంగా తగ్గించొచ్చని, అందరూ ధైర్యంగా టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు.
Go Back to Shorts
COVID19
Covishield
COVAXIN
Punjab

More Telugu News