శ్రీవారి ఆన్లైన్ టికెట్లను ఇప్పట్లో పెంచే యోచన లేదు: టీటీడీ
- కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత ఆలోచిస్తామన్న టీటీడీ
- సామాన్య భక్తులకు నిరాశ
- శ్రీవారి జిలేబీ, మురుకుల ప్రసాదం ధరల పెంపు
మరోవైపు, శ్రీవారి జిలేబీ, మురుకుల ప్రసాదం ధరలను టీటీడీ పెంచింది. శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ సమయంలో జిలేబీతోపాటు మురుకులను నివేదిస్తుంటారు. తిరుప్పావడ టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ. 100గా ఉన్న ధరను రూ. 500కు పెంచింది. కాగా, చిన్న, పెద్ద లడ్డూలు, వడల ధరలను టీటీడీ ఇప్పటికే పెంచింది.