కేశినేని నానికి మతి భ్రమించింది.. ఆయన ఎంపీగా ఉండటం దౌర్భాగ్యం: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- జగన్ ను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదు
- విజయవాడ అభివృద్ధిని టీడీపీ నేతలు పట్టించుకోలేదు
- కృష్ణలంక ప్రజల కోసం ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ నిర్మిస్తోంది
ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని చెప్పారు. విజయవాడ అభివృద్ధిని టీడీపీ నేతలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కృష్ణలంక ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ నిర్మిస్తోందని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఆయన ఆనందయ్య మందును పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.