శ్రీ‌లంక‌లో స్విమ్మింగ్ పూల్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాళ్లు.. ఫొటో వైర‌ల్!

team india pic goes viral
  • శిఖ‌ర్  ధావన్ నేతృత్వంలో టీమిండియా శ్రీలంక ప‌ర్య‌ట‌న‌
  • త్వ‌ర‌లోనే 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు
  • క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా
శిఖ‌ర్ ధావన్ నేతృత్వంలో టీమిండియా.. శ్రీలంకతో త్వ‌ర‌లోనే 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే శ్రీలంక వెళ్లిన భారత ఆట‌గాళ్లు క‌రోనా ఆంక్ష‌ల మేర‌కు క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. దీంతో జ‌ట్టు ఆట‌గాళ్లు అంద‌రూ ఓ హోట‌ల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేశారు.
        
ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ పోస్ట్ చేసింది. జ‌ట్టు స‌భ్యులు అంద‌రూ క‌లిసి స్విమ్మింగ్ పూల్‌లో చిరున‌వ్వులు చిందిస్తూ ఫొటోకు పోజు ఇచ్చారు. క్వారంటైన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో వారంతా ఎంజాయ్ చేస్తున్నార‌ని బీసీసీఐ తెలిపింది.  
Go Back to Shorts
Team India
India
Sri Lanka

More Telugu News