Hyderabad: 18 ఏళ్లు దాటిన వారికి హైదరాబాద్‌లో నేటి నుంచి టీకా

Vaccination Drive in Hyderabad for 18 years above from today
  • ఇప్పటి వరకు 35 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా
  • నగర వ్యాప్తంగా 100 వ్యాక్సిన్ కేంద్రాలు
  • కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకా
హైదరాబాద్‌లో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో ఇప్పటి వరకు 35 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు వేశారు. నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ఇందుకోసం నగర వ్యాప్తంగా 100 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

లబ్ధిదారులు తొలుత కొవిన్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలా చేసుకున్న వారికే టీకాలు వేస్తామని పేర్కొన్నారు. కొవిన్‌లో పేర్లు నమోదు చేసుకున్న తర్వాత తమ సమీపంలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లలో టీకా వేయించుకోవచ్చని వివరించారు.
Hyderabad
Corona Vaccine
GHMC
Cowin

More Telugu News