నా పేరుపై ఉన్న పట్టా భూమిని వేరొకరికి మార్చేశారు: పరిటాల సునీత
- చెన్నేకొత్తపల్లిలో సునీత మీడియా సమావేశం
- రెవెన్యూ అధికారులపై ఆగ్రహం
- ఆన్ లైన్ లో వివరాలు మార్చేస్తున్నారని ఆరోపణ
- రైతులకు అన్యాయం చేయొద్దని స్పష్టీకరణ
అధికార పక్షం ఒత్తిళ్ల నేపథ్యంలో, రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. అన్ని భూ రికార్డులు సక్రమంగా ఉన్న రైతులకు అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. చెన్నేకొత్తపల్లిలో మీడియాతో మాట్లాడుతూ పరిటాల సునీత ఈ వ్యాఖ్యలు చేశారు.