మంత్రిగా ఉన్నప్పుడే ఏమీ చేయలేదు.. ఇప్పుడేం చేస్తారు?:ఈటలపై గంగుల విమర్శలు
- సొంత పనుల కోసమే సీఎంను కలిసేవారు
- తన నియోజకవర్గాన్ని ఈటల అభివృద్ధి చేయలేదు
- హుజూరాబాద్ లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది
తామంతా తమ నియోజకవర్గ పరిస్థితిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే రూ. 31 కోట్లను మంజూరు చేశారని గంగుల చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరగని అభివృద్ధిని కేవలం ఏడేళ్లలో కేసీఆర్ చేశారని చెప్పారు. దేశంలో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఈటలను నియోజకవర్గ ప్రజలు నమ్మబోరని అన్నారు.