ఆఫ్ఘన్లోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలి: కేంద్రం హెచ్చరిక
- ఆఫ్ఘన్పై పట్టు సాధిస్తున్న తాలిబన్లు
- పెరుగుతున్న హింసాత్మక దాడులు
- భద్రతా నియమావళిని జారీ చేసిన భారత్
- విదేశీయులకు హాని ఉండదని తాలిబన్ల హామీ
- తాలిబన్లతో రహస్యంగా చర్చలు ప్రారంభించిన భారత్?
ఈ క్రమంలో దీనిపై స్పందించిన తాలిబన్లు.. రాయబారులు, సైనికేతర విదేశీ పౌరులు, రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బందికి ఎలాంటి హాని ఉండదని ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘనిస్థాన్’ తరఫున హామీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
మరోపక్క, క్రమంగా ఆఫ్ఘన్పై పట్టు సాధిస్తున్న తాలిబన్లతో భారత్ ఇప్పటికే రహస్యంగా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ మేరకు దోహాలో ఉన్నత స్థాయిలో పలు దఫాలు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఇవి ఇంకా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్థాయి వరకు రాలేదని సమాచారం.