రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనపై కీలక నిర్ణయం తీసుకున్న కేఆర్ఎంబీ!
- ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లాలనుకున్న కేఆర్ఎంబీ
- రేపటి పర్యటన వాయిదా
- ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక పర్యటించాలని నిర్ణయం
- కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని యోచన
అవసరమైతే కేంద్ర భద్రతా బలగాల సాయం తీసుకోవాలని కేఆర్ఎంబీ అధికారులు యోచిస్తున్నారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు భద్రతా బలగాల రక్షణ తప్పనిసరి అని భావిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జులై 3 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ బోర్డును ఆదేశించిన సంగతి తెలిసిందే.