పంజాబ్ ప్రజలకు 'ఉచిత విద్యుత్' హామీ నిచ్చిన కేజ్రీవాల్
- చండీగఢ్లో నేడు కేజ్రీవాల్ ‘పెద్ద ప్రకటన‘
- పెరుగుతున్న ధరలతో పంజాబ్ మహిళలు సంతోషంగా లేరన్న ఆప్ చీఫ్
- ఆప్ ఆరోపణలను కొట్టిపడేసిన పంజాబ్ సీఎం
మరోవైపు, ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ నేడు చండీగఢ్లో ‘పెద్ద ప్రకటన’ చేయబోతున్నట్టు చెప్పారు. కేజ్రీవాల్ చేయబోయే ప్రకటన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన పార్టీలో 440 వోల్టుల విద్యుత్ను ప్రవహించేలా చేస్తుందని అన్నారు. ఆ భయంతోనే పంజాబ్ భవన్లో కేజ్రీవాల్ ఏర్పాటు చేయాలనుకున్న విలేకరుల సమావేశానికి అనుమతి నిరాకరించారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలను అమరీందర్ కొట్టిపడేశారు. ఈ వార్తల్లో నిజం లేదని, అవసరమైతే కేజ్రీవాల్కు తాను లంచ్ కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు.