శశి థరూర్ ఖాతాను కూడా నిలిపివేసిన ట్విట్టర్
- కొత్త ఐటీ చట్టం తీసుకువచ్చిన కేంద్రం
- మొండిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్
- కేంద్ర ప్రముఖుల ఖాతాలపై కొరఢా ఝుళిపిస్తున్న సంస్థ
- రవిశంకర్ ప్రసాద్ ఖాతా నిలిపివేత
- థరూర్ ఖాతా రెండుసార్లు నిలిపివేత
తొలుత రవిశంకర్ ప్రసాద్ ఖాతాతో పాటు తన ఖాతాను కూడా నిలిపివేశారంటూ థరూర్ ఓ ట్వీట్ చేశారు. అయితే ట్విట్టర్ మరోమారు థరూర్ ఖాతాను స్తంభింపజేసింది. దీనిపై థరూర్ స్పందిస్తూ, ఇలా ఖాతాలను స్తంభింపజేసే బదులు, ఆ వీడియో కంటెంట్ డిజేబుల్ చేయొచ్చు కదా? అని హితవు పలికారు. కేంద్రం పంపిన నోటీసులకు ప్రతిస్పందనగా ఇలా ఖాతాలు నిలిపివేయడం మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు. 'ట్విట్టర్ నేర్చుకోవాల్సింది చాలావుంది' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.