Hero: ఎలక్ట్రిక్ టూవీలర్ల ధర తగ్గించిన హీరో

  • ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కేంద్రం ప్రోత్సాహం
  • రాయితీలు పెంచిన వైనం 
  • రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు
  • పలు మోడళ్ల ధరలు సవరించిన హీరో
Hero cuts price of electric vehicles

ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల ధరలు తగ్గించింది. సింగిల్ బ్యాటరీ వేరియంట్ పై 12 శాతం,  ట్రిపుల్ బ్యాటరీ వేరియంట్లపై 33 శాతం వరకు తగ్గిస్తున్నట్టు హీరో వెల్లడించింది. ఫేమ్-2 (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకంలో భాగంగా కేంద్రం రాయితీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, రాయితీల పెంపుతో కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలన్న ఉద్దేశంతో ధరల సవరణ చేపట్టామని వివరించింది.

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను కేంద్రం రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 1 కిలోవాట్ అవర్ కు రూ.10 వేలు రాయితీ ఇస్తుండగా, ఫేమ్-2లో భాగంగా దాన్ని రూ.15 వేలకు పెంచారు. అంతేకాదు, వాహనం ధరలో 20 శాతం వరకు అందించే సబ్సిడీని కూడా 40 శాతానికి పెంచారు. ఈ నేపథ్యంలోనే హీరో సంస్థ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.

More Telugu News