ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట
- ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడంటూ మనీశ్ పై ఆరోపణలు
- నోటీసులు పంపిన ఘజియాబాద్ పోలీసులు
- కోర్టును ఆశ్రయించిన ట్విట్టర్ ఎండీ
- చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఉత్తర్వులు
నేరంతో తనకు సంబంధం లేదని, అయినప్పటికీ తనకు నోటీసులు పంపారని మనీశ్ మహేశ్వరి తన రిట్ పిటిషన్ లో ఆరోపించారు. తాను బెంగళూరులో నివసిస్తున్నానని, యూపీ పోలీసులు తనను వ్యక్తిగతంగా హాజరు కావాలంటున్నారని కోర్టుకు తెలిపారు. వర్చువల్ గా విచారించవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని మనీశ్ మహేశ్వరి ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు... యూపీ పోలీసులు వర్చువల్ గా విచారించవచ్చు కదా? అని సూచించింది.