పైనుంచి కొట్టుకొస్తున్న శవాలతో గంగానది కలుషితమవుతోంది: మమతా బెనర్జీ
- ఇటీవల యూపీ, బీహార్ వద్ద గంగానదిలో శవాలు
- నదిలో కరోనా మృతుల శవాలతో కలుషిత వాతావరణం
- శవాలను బయటికి తీస్తున్నామన్న మమత
- తామే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి
కరోనాతో చనిపోయినట్టుగా భావిస్తున్న మృతదేహాలు ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్ వైపు కొట్టుకొస్తున్నాయని వెల్లడించారు. ఇలాంటి శవాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నదీ జలాలు కలుషితం అవుతున్నాయని మమత ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి తామే నదిలోంచి శవాలను బయటికి తీసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామని వివరించారు.