నా రాజకీయ జీవితంలో గొప్ప స్నేహితుడు రఘువీరారెడ్డి: చిరంజీవి
- పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఆయనతో అనుబంధం బలపడింది
- రాయలసీమకు నీళ్లు ఇవ్వడం ఆయన దార్శనికతకు నిదర్శనం
- నేను నటుడిగా కొనసాగుతుంటే.. ఆయన రైతుగా మారారు
కరువుసీమకు నీళ్లు ఇవ్వాలనే కథాంశంతో తాను 'ఇంద్ర' సినిమాను తీశానని... ఆ సినిమా ప్రేరణతోనే రఘువీరా కరువుసీమకు నీళ్లు ఇచ్చారని, ఇది ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమని చిరంజీవి ప్రశంసించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడం, ఆ కార్యక్రమానికి తాను హాజరుకావడం తన భాగ్యమని అన్నారు. తాను మళ్లీ సినిమాలు చేస్తూ నటుడిగా కొనసాగుతుంటే... రఘువీరా రైతుగా మారారని చెప్పారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలను పునర్నిర్మిస్తున్నారని, కొత్త ఆలయాలను నిర్మిస్తున్నారని కొనియాడారు. రఘువీరాకు భగవంతుని ఆశీస్సులు, ప్రజల సహకారం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.