'భీష్మ' దర్శకుడికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్!
- 'గని' షూటింగులో బిజీగా వరుణ్ తేజ్
- సెట్స్ పైకి వెళుతున్న 'ఎఫ్ 3'
- చరణ్ విన్న కథ వరుణ్ దగ్గరికి
తాజాగా వరుణ్ తేజ్ నుంచి వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. 'ఛలో' .. 'భీష్మ' సినిమాల భారీ విజయాలతో దర్శకుడిగా తానేమిటనేది వెంకీ కుడుముల నిరూపించుకున్నాడు. ఆ తరువాత సినిమాను చరణ్ తో చేయాలనే ఉద్దేశంతో ఆయనకి కథను వినిపించాడు. ఈ కథ తనకంటే వరుణ్ తేజ్ కి బాగా సెట్ అవుతుందని చెప్పి, చరణ్ ఆయన దగ్గరికి పంపించాడట. అలా వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్లిన ప్రాజెక్టు ఇప్పుడు సెట్ అయిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.