రేపటితో ముగియనున్న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం... మండలిలో పెరగనున్న వైసీపీ బలం
- మండలిలో ఇక వైసీపీ హవా
- 15కి పడిపోనున్న టీడీపీ సభ్యుల సంఖ్య
- 20కి పెరగనున్న వైసీపీ బలం
- రేపటితో ఉమ్మారెడ్డి కూడా రిటైర్
తాజా పరిణామాలతో అసెంబ్లీ, శాసనమండలి రెండింట్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పటివరకు మండలిలో తనకున్న బలంతో టీడీపీ పలు బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగి, టీడీపీ సభ్యుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఇకపై ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు.