ఉత్తర కొరియా ప్రజలు కొంతకాలం ఆంక్షలకు సిద్ధపడాలి: కిమ్ జాంగ్ ఉన్
- కిమ్ అధ్యక్షతన సెంట్రల్ కమిటీ సమావేశం
- గతేడాది టైఫూన్ తో వ్యవసాయరంగం కుదేలైందన్న కిమ్
- దేశంలో ఆహార సంక్షోభం ముప్పు ఏర్పడిందని వెల్లడి
- కొద్దిమేర ఆర్థిక స్థితి మెరుగైందని వివరణ
ఈ సమావేశంలో కిమ్ మాట్లాడుతూ, గతేడాదితో పోల్చితే పారిశ్రామిక ఉత్పాదకత 25 శాతం మెరుగైందని, మొత్తమ్మీద ఈ ఏడాది ప్రథమార్థంలో ఆర్థిక స్థితి కుదుటపడిందని వెల్లడించారు. అయితే ఆహార లభ్యతకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, గతేడాది వచ్చిన టైఫూన్ తో వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రజలు కూడా కొన్ని ఆంక్షలు ఎదుర్కొనడానికి సిద్ధపడాలని కిమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.