కరోనా బాధితులకు అండగా.. విజయ్ సేతుపతి భారీ విరాళం!
- సీఎం స్టాలిన్ ను కలిసిన సేతుపతి
- రూ. 25 లక్షల చెక్కు అందజేత
- సేతుపతిని అభినందించిన స్టాలిన్
కరోనా బాధితుల సహాయార్థం తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. 25 లక్షల విరాళాన్ని సేతుపతి అందించాడు. తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి ఆ మొత్తానికి చెక్కును అందించారు. ఈ సందర్భంగా సేతుపతిని స్టాలిన్ అభినందించారు. ఇప్పటికే పలువురు తమిళ నటులు తమ వంతుగా భారీ విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.