గ్రూప్-1 పరీక్షల కేసు తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు
- మెయిన్స్ పేపర్ల మూల్యాంకనంపై హైకోర్టులో పిటిషన్
- ప్రైవేటు సంస్థకు మూల్యాంకన బాధ్యతలు ఇచ్చారని ఆరోపణ
- ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు
- మూల్యాంకనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు
కాగా, గ్రూప్-1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంపై అటు విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ లేఖ కూడా రాశారు. ముందుగా ఎలాంటి అధ్యయనం చేపట్టకుండా డిజిటల్ మూల్యాంకనం చేయడం వల్ల విమర్శలు వస్తున్నాయని లోకేశ్ వివరించారు. 2018లో గ్రూప్-1 పరీక్షల నోటిఫికేషన్ వెలువడగా, 2020లో పరీక్ష నిర్వహించారు. గత ఏప్రిల్ లో ఫలితాలు ప్రకటించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.