బీజేపీలో చేరేముందే ఈటలకు పరాభవం: కడియం శ్రీహరి
- నడ్డా సమక్షంలో ఆయన ఎందుకు చేరలేదో చెప్పాలి
- ఆస్తులను కాపాడుకోవడానికే ఆయన బీజేపీలో చేరినట్లుంది
- ఇన్నాళ్లు బీజేపీపై విమర్శల జల్లు కురిపించారు
- ఇప్పుడు అదే పార్టీలో చేరారు
ఆస్తులను కాపాడుకోవడానికే ఆయన బీజేపీలో చేరినట్లుందని కడియం శ్రీహరి అన్నారు. ఇన్నాళ్లు బీజేపీపై విమర్శల జల్లు కురిపించిన ఆయన ఇప్పుడు అదే పార్టీలో చేరడం సిగ్గుచేటని కడియం శ్రీహరి విమర్శించారు. ఈటలకు టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని, ఈ పార్టీలో అన్ని పదవులను అనుభవించి ఇప్పుడు ఆ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.