మాన్సాస్ ట్రస్టుపై ప్రభుత్వ జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో ధర్మమే గెలిచింది: నారా లోకేశ్
- హైకోర్టులో మాన్సాస్ ట్రస్టు కేసు విచారణ
- చైర్ పర్సన్ గా సంచయిత నియామకం రద్దు
- అశోక్ గజపతి పునర్నియామకంపై హైకోర్టు ఆదేశాలు
- ఈ తీర్పు సర్కారుకు చెంపపెట్టు అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
వేల కోట్ల ఆస్తులు, భూములు ప్రజల కోసం దానమిచ్చిన పూసపాటి వంశీకుల దానగుణానికి సత్యనిష్ఠకు న్యాయస్థానం తీర్పు మరింత వన్నె తెచ్చిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. అరాచక ప్రభుత్వ పాలనపై సింహాచలం అప్పన్న ఆశీస్సులతో ప్రజాభిమానం, చట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజయం అని పేర్కొన్నారు. న్యాయపోరాటం సాగించి విజయం సాధించిన అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలియజేస్తున్నట్టు లోకేశ్ ట్విట్టర్ లో తెలిపారు.