సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్
- సీజేఐ అయిన తర్వాత తొలిసారి హైదరాబాదుకు విచ్చేసిన జస్టిస్ రమణ
- ఎయిర్ పోర్ట్ వద్ద స్వాగతం పలికిన హైకోర్టు సీజే, మంత్రి కేటీఆర్
- రాజ్ భవన్ లో మూడు రోజులు బస చేయనున్న సీజేఐ
విమానాశ్రయం నుంచి సీజేఐ రాజ్ భవన్ లోని అతిథి గృహానికి చేరుకున్నారు. రాజ్ భవన్ వద్ద ఆయనకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు సీజేఐ రాజ్ భవన్ లో బస చేయనున్నారు.






.