శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 53 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత!
- దోహా నుంచి వచ్చిన జాంబియా మహిళ
- 8 కిలోల హెరాయిన్ పట్టివేత
- నిందితురాలిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు
ఆమె నుంచి 8 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీని మొత్తం విలువ రూ. 53 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. జాంబియాకు చెందిన నిందితురాలి పేరు ముకుంబా కరోల్ అని తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.