తెలంగాణలో కొత్తగా 2,070 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- తెలంగాణలో బాగా తగ్గిన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 1,38,182 కరోనా పరీక్షలు
- గ్రేటర్ హైదరాబాదులో 245 పాజిటివ్ కేసులు
- రాష్ట్రంలో 18 మంది మృతి
- 94.47 శాతానికి పెరిగిన రికవరీ రేటు
రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,89,734 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,57,162 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 29,208 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,364గా నమోదైంది. రికవరీ రేటు మరికాస్త పెరిగి 94.47 శాతానికి చేరింది.