ఏపీలో మరో 10,373 కరోనా పాజిటివ్ కేసులు, 80 మరణాలు
- గత 24 గంటల్లో 88,441 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరిలో 1,880 కొత్త కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 309 కేసులు
- చిత్తూరు జిల్లాలో 12 మంది మృతి
అదే సమయంలో 15,958 మంది కరోనా నుంచి కోలుకోగా, 80 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 12 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 17,49,363 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,09,879 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,28,108 మందికి చికిత్స కొనసాగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 11,376కి పెరిగింది.