జంతువులను కూడా వదలని కరోనా.. తమిళనాడులో సింహం మృతి!
- కరోనాతో తొమ్మిదేళ్ల ఆడ సింహం మృతి
- జూలోని 11 సింహాల్లో తొమ్మిదింటికి కరోనా పాజిటివ్
- నెల రోజులుగా జూ మూతపడి ఉన్నప్పటికీ కరోనా సోకిన వైనం
ఈ జూలో ఉన్న మొత్తం 11 సింహాల్లో 9 సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. లాక్ డౌన్ కారణంగా నెల రోజులుగా జూ మూతపడి ఉన్నప్పటికీ... వీటికి కరోనా సోకడం గమనార్హం. మరోవైపు జూలో పని చేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో ఎవరికీ కరోనా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో సింహాలకు కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు దృష్టి సారించారు.