Harish Rao: పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన హరీశ్ రావు
టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి హరీశ్ రావు నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గం సిద్ధిపేటలో ఆయన మొక్కలు నాటారు. కరోనా నేపథ్యంలో, కార్యక్రమానికి ఆయన ఎవరినీ ఆహ్వానించలేదు. అతికొద్ది మంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ముగించారు.
మరోవైపు, హరీశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించి హరీశ్ కు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. దీనిపై నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా ఎవరూ రావద్దని ఆయన కోరారు.
మరోవైపు, హరీశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించి హరీశ్ కు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. దీనిపై నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా తాను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా ఎవరూ రావద్దని ఆయన కోరారు.