ఒలింపిక్స్ కు వెళ్లే బృందాన్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ
- జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్
- జపాన్ లోని టోక్యో వేదికగా విశ్వక్రీడాసంరంభం
- త్వరలో భారత బృందం జపాన్ పయనం
- ఏర్పాట్లను సమీక్షించిన ప్రధాని
- అందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని ఆదేశం
ఇక, కరోనా వ్యాప్తి నేపథ్యంలో, ఒలింపిక్స్ కు వెళ్లే భారత క్రీడాకారులందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులతో పాటు కోచ్ లు, ఇతర సహాయక సిబ్బంది, జట్టు అధికారులకు కూడా వ్యాక్సిన్ అందించాలని సూచించారు. ఒలింపిక్స్ కు వెళ్లే భారత బృందం కోసం జరుగుతున్న ఏర్పాట్లపై మోదీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.