ఓటీటీ వైపు వెళ్లనున్న మెగా హీరో మూవీ?
- సాయితేజ్ తాజా చిత్రంగా 'రిపబ్లిక్'
- కరోనా కారణంగా వాయిదాపడిన రిలీజ్
- కథానాయికగా ఐశ్వర్య రాజేశ్
- పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
అలా ఓటీటీ వైపు వెళుతున్న సినిమాల జాబితాలో 'రిపబ్లిక్' కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. సాయితేజ్ కథానాయకుడిగా దర్శకుడు దేవ కట్టా ఈ సినిమాను రూపొందించాడు. నిజానికి ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడింది. అందువలన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ దిశగా చర్చలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడవలసిందే. జగపతిబాబు .. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.