విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈ సాయంత్రం రానున్న దుబాయ్ విమానం
- వారానికి 10 విమానాలు వచ్చే అవకాశం
- మస్కట్, సింగపూర్, కువైట్ నుంచి విమానాలు
- కొవిడ్ కారణంగా ఏప్రిల్ 3న నిలిచిన విదేశీ సర్వీసులు
వందే భారత్ మిషన్ లో భాగంగా రానున్న విదేశీ విమాన సర్వీసుల కోసం గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేభారత్ మిషన్ లో భాగంగా విదేశీ విమాన సర్వీసులు అక్టోబరు వరకు కొనసాగనున్నాయి. 18 దేశాల నుంచి ఇప్పటిదాకా 56,038 మంది ప్రవాసులు ఏపీకి చేరుకున్నారు. వీరిలో కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారే 29,356 మంది ఉన్నారు.