కరోనా నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై నీతి ఆయోగ్ ప్రకటన
- చిన్నారుల్లో కరోనాపై వీకే పాల్ స్పందన
- కరోనా నుంచి కోలుకున్నా సమస్యలు వస్తాయని వివరణ
- వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచన
- ఒక్కోసారి కరోనా లక్షణాలు కనిపించడంలేదని వెల్లడి
వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో మార్పులొస్తే కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా సమస్యలు వస్తే ఆసుపత్రిలో చేరాలని స్పష్టం చేశారు. కొందరిలో కోలుకున్న 3 వారాల తర్వాత కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. దేశంలో తాజా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని వీకే పాల్ వెల్లడించారు.