బీజేపీలో ఈటల చేరికను మా పార్టీ నేతలంతా స్వాగతిస్తున్నారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- ఢిల్లీలో జేపీ నడ్డాను ఈటల కలుస్తారు
- బండి సంజయ్ తోనూ, నాతోనూ ఈటల చర్చించారు
- నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే బీజేపీని బలోపేతం చేస్తున్నాం
- పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామన్న మంత్రి
ఆయన చేరికపై తమ పార్టీలో సానుకూల వాతావరణం ఉందని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామని చెప్పారు. పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రాన తాను స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో నియంత కేసీఆర్ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని, నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేస్తున్నామని వ్యాఖ్యానించారు.