Vadivel: కరోనా నుంచి రక్షణ ఇస్తుందని చచ్చిన పామును తిన్నాడు!

  • కరోనాపై గ్రామాల్లో అపోహలు
  • పామును తింటే కరోనా రాదంటున్న వ్యవసాయకూలీ
  • చచ్చిన పామును తింటున్న వీడియో వైరల్
  • అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు
Madurai man eats snake to spare himself from corona

కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంగా దేశంలో స్వైర విహారం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనిపై అపోహలు ఉన్నాయి. తమిళనాడులో ఓ వ్యక్తి కరోనా నుంచి రక్షణ కలిగిస్తుందంటూ చచ్చిన పామును తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. అతడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మదురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వడివేలు ఓ రైతు కూలీ. ఇటీవల వడివేలు ఓ చచ్చిన పామును తిన్నాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పామును తింటే కరోనా రాదని వడివేలు చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. కరోనా నుంచి రక్షణ కోసమే పామును చంపి తింటున్నానని అతడు వివరించాడు. అయితే ఈ వీడియో స్థానిక అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే వడివేలును అరెస్ట్ చేశారు. అతడికి ఏడు వేల రూపాయలు జరిమానాగా విధించారు.

More Telugu News