Jagan: రెండేళ్ల పాలనపై పుస్తకం... రేపు మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం జగన్

  • ఏపీలో జగన్ పాలనకు రెండేళ్లు
  • ప్రజాసంక్షేమంపై పుస్తకం
  • పథకాలే ఇతివృత్తంగా పుస్తకం రూపకల్పన
  • జగన్ పాలనపై ప్రజలకు పుస్తకం ద్వారా నివేదన
CM Jagan will launch book on his two year administration

సీఎం జగన్ ఏపీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు. అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News