చాలా పెద్ద రిస్క్ చేశామంటున్న రాశి ఖన్నా
- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ'
- నిర్మాతగా దిల్ రాజు
- చైతూ జోడీగా రాశి ఖన్నా
- ఇటలీ షెడ్యూల్ పూర్తి
తాజాగా రాశి ఖన్నా ఆ విషయాలను గురించి మాట్లాడుతూ ... "ఇండియాలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటిది షూటింగు కోసం ఏకంగా ఇటలీ వెళ్లవలసి వచ్చింది. ఇటలీ వెళ్లినప్పటికీ అందరిలోను టెన్షన్ ఉంది. అక్కడ కొన్ని లొకేషన్స్ లో కరోనా కేసులు బయటపడటంతో అనుమతులు లభించలేదు. దాంతో మా టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయోనని కంగారుపడ్డాం. అనుకున్నట్టుగా షూటింగును పూర్తిచేసుకుని హమ్మయ్య అనుకున్నాము" అని చెప్పుకొచ్చింది.