తుపాను ప్రభావిత రాష్ట్రాలకు రూ.1000 కోట్ల సాయం ప్రకటించిన ప్రధాని మోదీ
- యాస్ తుపాను ధాటికి ఒడిశా, బెంగాల్ లో బీభత్సం
- ఝార్ఖండ్ లోనూ నష్టం
- ఏరియల్ సర్వే చేపట్టిన ప్రధాని మోదీ
- ఒడిశా, బెంగాల్ సీఎంలతో సమావేశం
- కేంద్రం నుంచి మరింత సహకారం అందిస్తామని హామీ
పూర్తిస్థాయిలో తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని పీఎంఓ వెల్లడించింది. నేడు ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని కలైకుంద ఎయిర్ బేస్ లో భేటీ అయ్యారు. వీరిద్దరూ 15 నిమిషాల పాటు తుపాను నష్టంపై చర్చించారు.
అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ, యాస్ తుపాను వల్ల బెంగాల్ కు జరిగిన నష్టంపై ప్రధానికి నివేదిక ఇచ్చానని తెలిపారు. బెంగాల్ కు తుపాను సాయం కింద రూ.20 వేల కోట్లు కోరినట్టు మమత వెల్లడించారు. దిఘా, సుందర్ బన్ అభివృద్ధికి కూడా నిధులు కోరినట్టు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు ఏరియల్ సర్వే చేపడుతున్నట్టు ఆమె వివరించారు.